కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
-మృతులు నంద్యాల జిల్లా వాసులు
బెంగళూరు ముచ్చట్లు:
కర్ణాటక రాష్ట్రం యదగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ప్రమాదానికి గురయింది. మంగళవారం తెల్లవారుజామున ఘటన జరిగింది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పదమూడు మందికి గాయాలయ్యాయి. గుల్బర్గాలోని దర్గాకు దైవదర్శనం కోసం వెళుతుండగా ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గుల్బర్గా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు, వెలుగోడు ప్రాంతాలకు చెందిన మునీర్ (40), నయామత్ (40), రమీజా బేగం (50),ముద్దత్ షీర్ (12), సుమ్మి (13)లు గా గుర్తించారు.
Tags: Fatal road accident in Karnataka.. Five killed