ఘనంగా సావిత్రభాయిపూలే 125 వర్ధంతి.
బద్వేలు ముచ్చట్లు:
-బద్వేల్ పట్టణంలోని సావిత్రిభాయిఫూలే విగ్రహం వద్ద సావిత్రిభాయి 125 వ వర్ధంతి కార్యక్రమం ఫూలే ఆశయసాధన సమితి ఆధ్వర్యంలో పూలమాల వేసి ఘననివాళులర్పించారు.ఈ సందర్భంగా సమితి ఛైర్మెన్ బద్వేలు గురుమూర్తి మాట్లాడుతూ ఆధునిక భారతదేశపు ప్రప్రధమ మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయి.ఈమె మహారాష్ట్ర లోని సతారా జిల్లా నయాగావ్ అనే గ్రామంలో జన్మించి తన 9 వ యేట ఫూలేతో బాల్యవివాహం జరిగి భర్త జ్యోతిరావ్ఫూలే అడుగుజాడలలో నడచి కుల నిర్మూలన,శూద్రుల,అతిశూద్రుల,మహిళల హక్కులకోసం భర్తతో కలిసి ఉద్యమాలు చేశారు.స్రీ విద్య ద్వారాన అవిద్య వంటింటికే పరిమితమైన స్తీలకు విముక్తి అని మే 12,1848 లోఫూలే స్థాపించిన అట్టడుగు వర్గాల బాలికల పాఠశాలలో విద్యరాని సావిత్రిభాయి తన భర్త వద్దవిద్య నేర్చుకొని ఉపాధ్యాయురాలుగ పనిచేసి స్రీ విద్యకు నాందిపలికి స్తీల చదువుల తల్లిగా ఖ్యాతిగాంచారు.రచయిత్రిగా కావ్యపూలే,పావన కాశీ సుబోధ్ రత్నాకర్ అనే రచనలను ప్రచురించారు.స్రీజాతికి ఆమె చేసిన సేవ ప్రశంసనీయము.1897 లో మహారాష్ట్ర లో వచ్చిన భయంకరమైన ప్లేగు వ్యాధిగ్రస్థులకు సేవచేసి ఆస్పత్రికి తరలిస్తూ ప్లేగు వ్యాధి సోకి మార్చి 10,1897 లో మరణించారు.సావిత్రిభాయి ఫూలే ఆశయాల సాధనకు అందరూ కృషిచేయాలి,కేంద్ర ప్రభుత్వం సావిత్రిభాయి ఫూలే జన్మదినమైన జనవరి 3,వ తేదీని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి ఆమె సేవలకు గుర్తింపును యివ్వాలని కోరుతున్నాము.
Tags:’125th death anniversary of Savitrabhai