Natyam ad

స్వచ్చ హైదరాబాదే లక్ష్యం.

హైదరాబాద్ ముచ్చట్లు:
సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నాం. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నాం అన్నారు మంత్రి కేటీఆర్. పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంభించారు మంత్రి కేటిఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత పాల్గొన్నారు.కొద్ది రోజుల్లో మరో 500 ఆటోలు రానున్నాయి. దీంతో మొత్తం 5000 ఆటోలు అవుతాయి.వాహనాల నుండి చెత్త రోడ్ల మీద పడకుండా మోడర్న్ టెక్నాలజీతో ఈ వాహనాలను తీసుకున్నాము.17 ట్రాన్స్ఫర్ స్టేషన్ లను తొందరగా ఆధునికీకరణ చేయాలి. 95 సెకండరీ కలెక్షన్ పాయింట్ లను ఏర్పాటు చేసుకున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. 51మిగతా వాహనాలు వస్తే పరిస్థితి మరింత మెరుగు అవుతుంది. 24 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ ను జవహర్ నగర్లో ప్రారంభించుకున్నాము. చెరువుల్లో పెరిగే గుర్రపు డెక్కను తొలగించడానికి 6 ప్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ లను ప్రారంభించామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయానికి అంతా సహకరించాలన్నారు.
 
Tags:Aim for a clean Hyderabad