బరి తెగించిన పాకిస్తాన్.. తిప్పి కొట్టిన ఆర్మీ
ఛండీఘడ్ ముచ్చట్లు:
భారత్ను డైరెక్ట్గా ఢీకొట్టే దమ్ములేని పాకిస్తాన్.. దొంగదెబ్బ తీసేందుకు వ్యూహరచన చేస్తోంది.. చివరకు ఇండియన్ ఆర్మీ దెబ్బకు పలాయనం చిత్తగిస్తోంది. మరోసారి బీఎస్ఎఫ్ సత్వరం పాకిస్థాన్ దుష్ట బుద్ధిని అణిచివేసింది. తమ ప్రమాదకరమైన ప్లాన్లతో పాకిస్థాన్ వైపు నుంచి భారత్లోకి ప్రవేశించిన డ్రోన్ను చూసి బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు ప్రారంభించారు. పంజాబ్అమృత్ సర్ జిల్లా రామ్దాస్ పీఎస్ పరిధిలోని బివోపి పంజ్ గ్రాహియా సమీపంలో, డ్రోన్ పేలుడు పదార్థాలను విసిరి పాకిస్తాన్కు బయలుదేరింది. భారత భూభాగంలో ఆ డ్రోన్ జారవిడిచిన రెండు పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో బీఎస్ఎఫ్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఆ ప్రాంతంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఆ పేలుడు పదార్థాల తీవ్రత..అవి ఎంత ప్రమాదవకరమైనవో గుర్తించేందుకు పరిశోధనలు చేస్తున్నారు. గతేడాది జమ్మూలో పలుమార్లు డ్రోన్లతో దాడులకు యత్నించింది పాకిస్తాన్. ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా మరోసారి డ్రోన్ ఎటాక్కు విఫలయత్నం చేసింది.గురుదాస్పూర్ సెక్టార్లోని పంజ్ గ్రాహియా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో “పాకిస్తాన్ వైపు నుండి భారత భూభాగం వైపు అనుమానాస్పద వస్తువు ఎగురుతున్న శబ్దం” వినిపించిందని, ఆ తర్వాత సైనికులు డ్రోన్పై కాల్పులు జరిపారని సీనియర్ బీఎస్ఎఫ్ అధికారి తెలిపారు. “గ్రామం ఘగ్గర్ మరియు సింఘోక్ ప్రాంతాల్లో సోదాలలో, అనుమానిత మాదక పదార్థాలతో కూడిన రెండు పసుపు రంగు ప్యాకెట్లు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్నాయి” అని సీనియర్ అధికారి తెలిపారు.
డ్రోన్ల ద్వారా ఈ ప్యాకెట్లు పడినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపారు. ప్యాకెట్లో పిస్టల్ కూడా చుట్టి ఉందని, కంచెకు 2.7 కిలోమీటర్ల దూరంలోని పొలంలో సరుకు లభించిందని అధికారి తెలిపారు. డ్రోన్ పడిపోయిందా లేక అదృశ్యమైందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు.
Tags: Burial Pakistan .. Army repelled