విజయవాడ ముచ్చట్లు:
ఏపీఎస్ఆర్టీసీ లో 1,168 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇచ్చేందుకు సీఎం జగన్ అంగీకరించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపధ్యంలో 34 మందికి
జూనియర్ అసిస్టెంట్లుగా, 146 మందికి ఆర్టీసీ కానిస్టేబుళ్లుగా, 175 మందికి కండక్టర్లుగా, 368 మంది డ్రైవర్లుగా, 445 మందికి అసిస్టెంట్ మెకానిక్లుగా ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయిస్తూ ఆర్టీసీ ఎండీ
ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
Tags;Compassionate Appointments in RTC