20 ప్యాన్లు విరాళం
చౌడేపల్లె ముచ్చట్లు:
మండలకేంద్రంలోని దొరబావి తోపు సమీపంలో గల అంబేద్కర్ కమ్యూనిటీ భవనంకు గడ్డంవారిపల్లె పంచాయతీ బత్తలాపురంకు చెందిన వెంకటేష్ 20 ప్యాన్లు విరాళంగా అందజేసినట్లు దృశ్యకళల అకాడమీ రాష్ట్ర డైరక్టర్ అంజిబాబు తెలిపారు. శుక్రవారం ధాత వెంకటేష్ చేతుల మీదుగా ప్యాన్లు విరాళమివ్వడం అభినందనీయమని కొనియాడారు. వీటి విలువ సుమారు 30 వేలు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరసింహులు యాదవ్,పీహెచ్సీ కమిటీ చైర్మన్ కళ్యాణ్,నేతలు రెడ్డెప్ప, డిష్ సూరి, శేఖర్, హరి, లక్ష్మినారాయం, శంకరప్ప కూరపర్తి శీన తదితరులున్నారు.
Tags; Donate 20 pans