Natyam ad

చౌడేపల్లె లో విద్యార్థులకు ప్లేట్లు విరాళం

చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలంలోని ఆమినిగుంట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గురువారం ప్లేట్లు విరాళంగా అందజేసినట్లు ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. ఆమినిగుంటకు చెందిన విశ్రాంత ఎస్‌ఐ నరసింహులు జ్ఞాపకార్తంగా ఆయన కుమారుడు సీపిఎస్‌ జిల్లా గౌరవఅధ్యక్షుడు రేగంటి దేవనంద కుటుంబ సభ్యులతో కలిసి 52 మంది విద్యార్థులకు ప్లేట్లు పంపిణీ చేశారు.పాఠశాల అభివృద్దికి తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ధాత పేర్కొన్నారు. అలాగే ఎంఈఓ చిట్రెడ్డిపల్లె, శెట్టిపేట,ఆమినిగుంట, దుర్గసముద్రం,దాదేపల్లె డి. రాజులూరు, జంగాలపల్లెలో పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్ద్యంపై ఆరా తీశారు. క్రమశిక్షణతో కూడిన విద్యను నేర్చుకోవాలని సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో దాతలు యర్రమ్మ, రవికుమార్,ప్రేమమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు మాధవిలత ,పద్మవతమ్మ,మాధవి , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
 
 

Tags: Donate plates to students in Choudepalle