కల్వర్ట్ ను ఢీకొన్న కారు..నలుగురు మృతి
మదనపల్లి ముచ్చట్లు:
కల్వర్టును కారు ఢీకొనడంతో నలుగురు మృతి చెందారు. ఘటనలో మరో ఇరువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 150 మైలు వద్ద మోరీని కారు ఢీకొని కల్వర్టకింద పడింది. మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారి పల్లి కి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం బుధవారం రాత్రి జరగడంతో గురువారం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
Tags:Four killed in car collision with culvert

