శ్రీవారిని దర్శించుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్
తిరుమల ముచ్చట్లు:
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.శ్రీవారి ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి అర్చకులు, అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం చేశారు. అనంతరం టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డిలు శ్రీవారి తీర్థప్రసాదాలు, క్యాలెండర్, డైరీ, కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆయనకు అందజేశారు.డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, అగరబత్తీలు, పంచగవ్య ఉత్పత్తులు మరియు ఆరు షీట్ల క్యాలెండర్తో తయారు చేసిన లామినేట్ చేసిన దేవత ఫోటోను ఈవో అందజేస్తూ, వాటి తయారీ మరియు ప్రాముఖ్యత గురించి ముఖ్యమంత్రికి వివరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వేంపల్లి శ్రీనివాసులు, డెప్యూటీ ఈవోలు రమేష్ బాబు, లోకనాధం తదితరులు పాల్గొన్నారు.
Tags: Himachal Pradesh Chief Minister Jairam Thakur visited Srivastava