Natyam ad

మలక్ పేటలో డబుల్ బెడ్ రూమ్ పత్రాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బలాల.

హైదరాబాద్ ముచ్చట్లు:
మలక్ పేట్ లోని  మూసారం బాగ్ మూసీ పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న గుడిసె వాసుల కు  డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే అహ్మద్ బలాల అందజేశారు. 205 గుడిసేవాసులకు మునగనూర్ లో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ కేటాయించమని ఎమ్మెల్యే అన్నారు. తిగలగూడ నుండి మునుగనూరు వరకు వెళ్లేందుకు లబ్దిదారులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు బలాల తెలిపారు.   మరి కొంత మందికి గుడిసె వాసులకు ఇళ్ల పట్టాలు లభించకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు.
 
Tags:MLA Balala distributes double bedroom papers in Malakpet