పోలియో వ్యాదిని నివారించాలి
పుంగనూరు ముచ్చట్లు:
చిన్న పిల్లలకు పోలియో వ్యాది సోకకుండ నివారించేందుకు పోలియో చుక్కలు వేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా కోరారు. ఆదివారం ఆయన పట్టణంలో కమిషనర్ రసూల్ఖాన్తో కలసి పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే మండలంలోని రాంపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రెడ్డికార్తీక్ పోలియో చుక్కలు వేశారు. పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు నాగేంద్ర, సి.ఆర్.లలిత, కౌన్సిలర్లు అమ్ము, త్యాగరాజు, కిజర్ఖాన్, కాళిదాసు, జేపి.యాదవ్, నటరాజ, పోలియో చుక్కలు ఆయా వార్డుల్లో వేశారు. వైద్య సిబ్బంది , వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కలసి పోలియో చుక్కలు వేశారు.
Tags; Polio should be prevented