వలిగొండ మండలంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పర్యటన
యాదాద్రి ముచ్చట్లు:
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అరూర్, అప్పారెడ్డిపల్లి, గొల్నేపల్లి గ్రామాలలో ఎంఎన్ఆర్ఈజీఎస్, ఎస్డీఎఫ్ నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, అరూరు గ్రామం లో రైతు సభ వేదిక స్మశాన వాటిక ను ప్రారంభోత్సవం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మొత్తం 50 లక్షల రూపాయల నిధులతో గ్రామాలలో ప్రజలకు చిన్నచిన్న అవసరాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మౌలిక వసతులను కల్పిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో టి ఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు మరియు జడ్పిటిసి వాకిటి పద్మా అనంత రెడ్డి ఎంపీపీ రమేష్ రాజు టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి పిఎసిఎస్ చైర్మన్లు వివిధ గ్రామ సర్పంచులు ఉప సర్పంచులు తుమ్మల రవీందర్ రెడ్డి నరసింహారెడ్డి వెంకట్ నారాయణ రెడ్డి వెంకట్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కృష్ణార్జున రెడ్డి మొదాల వెంకటేశం సామ సుదర్శన్ రెడ్డి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags: Shekhar Reddy visits MLA files in Valigonda zone

