Natyam ad

రోడ్డు మధ్యలో నిలిచిపోయిన బస్సు,వాహనాల రాకపోకలకు ఇబ్బంది.

గోకవరం ముచ్చట్లు:
ఆర్టీసీ బస్సు రోడ్డు మధ్యలో ఆగిపోయింది.. చక్రం బోల్డ్ విరిగిపోవటంతో నిలిచిపోయింది.. బోలెద్దుపాలెం గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు నిలిచిపోవటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.. రాజమండ్రి నుండి ప్రయాణికులతో వస్తున్న బస్సు చక్రం  బోల్టు విరిగిపోవటంతో నిలిచిపోయింది.. బోల్ట్ విరిగిపోయిందని, రిపేర్ చేయటానికి సిబ్బంది వస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు.. ఆదివారం సాయంత్రం బస్సు ఆగిపోగా, సోమవారం మధ్యాహ్నం సిబ్బంది వచ్చి రిపేర్ చేశారు.. ఈ రహదారి వైపు తిరిగే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పక్కనే ఉన్న చెట్లను నరికి దారి శుభ్రం చేసుకున్నారు.. ఆర్టీసీ బస్సులు సక్రమంగా ఉన్నాయో లేదో అధికారులు పరిశీలించాల్సి ఉంది..
 
Tags:The bus stopped in the middle of the road, causing trouble for vehicular traffic