నర్సుగా మారిన ఆయా…
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది. నీలోఫర్ లో ఇంజక్షన్లు వికటించి ఇద్దరు పసిగుడ్లు ప్రాణాలు వదిలిన వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. తమ పిల్లలు ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణం.. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కాకుండా ఆస్పత్రిలో పనిచేసే ఆయాలు ఇంజక్షన్లు చేస్తున్నారని చిన్నారుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నర్స్ కాకుండా ఆయా ఇంజెక్షన్ ఇవ్వడం వలెనే.. తమ పిల్లలు ఇంజక్షన్లు చేసిన క్షణాల్లోనే చనిపోయారంటూ తల్లిదండ్రులు చెబుతున్నారు.చిన్నారుల మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం..తమకు న్యాయం చేయాలంటూ హాస్పటల్ వద్ద చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆస్పత్రి ఇబ్బంది అలర్ట్ అయింది. అయితే ఈ విషయంపై నిలోఫర్ వైద్యులు స్పందించారు. ఆస్పత్రికి తీసుకువచ్చే సమయానికే చిన్నారుల ఆరోగ్యం విషమించిందని చెప్పారు. ప్రస్తుతం నిలోఫర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజా ఆరోపణలతో ఆస్పత్రిలోని మిగతా పిల్లల తల్లిదండ్రుల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.
వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యం లేదు
నీలోఫర్ ఆస్పత్రి నవజాత శిశువులు, వివిధ ఇబ్బందులతో వున్న చిన్నారులకు భరోసా కల్పించే ప్రభుత్వాసుపత్రి. ఎంతో చరిత్ర వున్న ఈ ఆస్పత్రిలో అప్పుడప్పుడు వైద్యం అందక చిన్నారులు మరణిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నీలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారుల మృతి వివాదం రేపింది. ఆస్పత్రిలో ఉదయం ఇద్దరు చిన్నారులకు ఇంజక్షన్లు ఇచ్చింది నర్స్. అయితే, ఇంజక్షన్లు ఇవ్వడం వల్లే ఇద్దరు పిల్లలు చనిపోయారంటున్నారు తల్లిదండ్రులు. ఆస్పత్రికి వచ్చేసరికే ఆరోగ్యం విషమించిందని నీలోఫర్ వైద్యులు చెబుతున్నారు.ఈ ఘటనపై వివరణ ఇచ్చారు నీలోఫర్ సూపరింటెండెంట్ మురళీ కృష్ణ. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోజుల వయస్సున్న ఒక శిశువు మరణించింది. నాగర్ కర్నూలు నుంచి మూడు రోజుల క్రితం శిశువుని నీలోఫర్ కు తల్లిదండ్రులు తీసుకువచ్చారు. 28 నెలలు మాత్రమే నిండి ఒక కేజీ బరువుతో మాత్రమే శిశువు జన్మించింది. అవయవాలు పూర్తి స్థాయిలో పెరగకపోవడం మరణానికి కారణం. 50శాతం మంది నెలలు నిండని శిశువులు మరణిస్తారు. ఇందులో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం లేదు. బేబీని కాపాడేందుకు అత్యవసరమైన ఇంజక్షన్ ఇచ్చినా బ్రతకలేదన్నారు మురళీ కృష్ణ.
Tags:The nurse who became a nurse …