హోదా కోసం కాంగ్రెస్ ను గెలిపించండి-ఏపీ పీసీసీ మీడియా చేర్మెన్ తులసి రెడ్డి
కడప ముచ్చట్లు:
హోదా లేదు పోలవరం కాదు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా చెప్పడం శోచనీయమని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు రాష్ట్రానికి సంజీవని. 2014 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రకటించారు. బిజెపితో సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాలి. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి భగవంతుడు ప్రసాదించిన వరం. విభజన చట్టంలో సెక్షన్ 90 ప్రకారం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిది. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయికట్టు10.13. లక్షల ఎకరాల స్థిరీకరణ 540 గ్రామాలకు త్రాగునీరు 960 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి గోదావరి కృష్ణా నదుల అనుసంధానం తదితర ప్రయోజనాలు ఉన్నాయి. 2014 లో గాని 2019 లో గాని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే హోదా అమలు అయి ఉండేది పోలవరం పూర్తయి ఉండేది. ప్రాంతీయ పార్టీలకు హోదా ఇచ్చే శక్తి లేదు తెచ్చే శక్తి లేదు పోలవరం పూర్తి చేసే సోమత లేదు. కాంగ్రెసును గెలిపించండి హోదా అమలు చేస్తాం పోలవరం పూర్తి చేస్తామని అయన అన్నారు.
Tags: Win Congress for status-APPC media chairman Tulsi Reddy