11న కాంగ్రెస్ జిల్లా సర్వసభ్య సమావేశం-నీలి శ్రీనివాసరావు.
కడప ముచ్చట్లు:
కడప నగరములో జనవరి 11వ తేదీ బుధవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం జరుగునుందని, ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజు హాజరుకానున్నారని జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు తెలిపారు.
శనివారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ,నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి లు జనవరి 11న రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్ర రాజు, ఏఐసీసీ సెక్రెటరీ సిడి మేయ్యప్పన్, పీసీసీ మీడియా చైర్మన్ డాక్టర్ నరెడ్డి తులసిరెడ్డి , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా గౌతమ్, ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర అధ్యక్షుడు మధు, హాజరుకానున్నారని తెలిపారు.
కడప జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో విస్తృతస్థాయిలో సమావేశం నిర్వహిస్తారని, నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తారన్నారు.
11వ తేదీ జరిగే కార్యక్రమానికి కడప జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నేతలు, నగర నేతలు, అన్ని మండలాలకు సంబంధించిన నేతలు, ఎస్సీ, ఎస్టీ ,బీసీ ,మైనార్టీ విభాగాలకు సంబంధించిన వారు, సేవాదళ్, ఎన్ ఎస్ యు ఐ,యూత్ కాంగ్రెస్ ,మహిళా కాంగ్రెస్, కార్మిక విభాగం, కిసాన్ సెల్, హ్యూమన్ రైట్స్ విభాగం, న్యాయవిభాగం, ఇలా అన్ని రకాల విభాగాలకు సంబంధించిన వారు తప్పకుండా హాజరు కావాలని కోరారు.
కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు ,నగర అధ్యక్షుడు విష్ణు ప్రీతం రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గౌడ్, నగర ఉపాధ్యక్షుడు మధు రెడ్డి, నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆనంద్, బీసీ నేత కణతల ప్రసాద్, జిల్లా కార్యదర్శి సూర్యుడు పాల్గొన్నారు.
Tags: 11 Congress district general meeting-Neeli Srinivasa Rao.