Natyam ad

26 ఎర్రచందనం దుంగలు పట్టివేత

సిద్దవటం రేంజర్ ప్రసాద్

 

సిద్దవటం
లంకమల అభయారణ్యంలోని సిద్దవటం రేంజ్ రోళ్లబోడు, సిద్దవటం బీటుల్లో రెండు బృందాలు గాలింపు చర్యలు చేపట్టి 26 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నట్లు సిద్దవటం రేంజర్ ప్రసాద్ తెలిపారు. మండలకేంద్రమైన సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో పట్టుబడిన ఎర్రచందనానికి సంబందించిన వివరాలను శనివారం ఆయన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ లంకమల అభయారణ్యంలోని రోళ్లబోడు బీటులో, సిద్దవటం టౌన్ బీటుల్లో శుక్రవారం సాయంత్రం రెండు బృందాలు కూంబింగ్ నిర్వహించాయన్నారు. కూంబింగ్ లో భాగంగా రోళ్లబోడు బీటులో 12 ఎర్రచందనం దుంగలు, సిద్దవటం టౌన్ బీటులో 14 ఎర్రచందనం దుంగలను పట్టుకోవడం జరిగిందన్నారు. ఈ మేరకు ఎర్రచందనం దుంగలను నరకిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీటు అధికారులు రాజశేఖర్ రెడ్డి, విశ్వనాథ్, హైమావతి, అటవీశాఖ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్లు, తదితరులు పాల్గొన్నారు

Post Midle

Tags;26 Harvesting of red sandalwood logs

Post Midle