Date:24/11/2020
హైద్రాబాద్ ముచ్చట్లు:
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యం గ్రేటర్ ప్రజలపై కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. గ్రేటర్లో గెలిపిస్తే.. వరద బాధితులకు రూ.50 వేల చొప్పున సాయం అందిస్తామని ప్రకటించింది. అలాగే వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం, పూర్తిగా దెబ్బతిన్న గృహాలకు ఇస్తామంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం కాంగ్రెస్ మేనిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ మాణికం ఠాగూర్ విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో నగర అభివృద్ధికి తాము చేపట్టబోయే చర్యలను వివరిస్తూ… పలు రకాల వరాలను ప్రకటించారు. గ్రేటర్లో గెలిస్తే.. ఉచితంగా 30 వేల లీటర్ల మంచి నీటిని అందిస్తామన్నారు. ఆర్ఎస్ పార్టీ హైదరాబాద్కు చేసిందేమి లేదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. లక్ష ఇళ్లు అని ఒక్క ఇళ్లైనా ఇచ్చారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలు మాటలతో మభ్యపెడుతున్నారే తప్ప.. ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదని ఆరోపించారు. మంగళవారం ఆయన ఇందిరా భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చిత్తు కాగితంతో సమానమని విమర్శించారు. గత ఎన్నికల్లో విడుదల చేసిన మేనిఫెస్టోనే మళ్లీ రిలీజ్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని, మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గతంలో చెప్పిన పనులే చేయలేదు.. మళ్ళీ అవే మాటలు చెప్తున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు
వరదల్లో చనిపోయిన కుటుంబాలకు రూ.25లక్షల పరిహారం
కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేరుస్తాం
మెట్రో, ఎంఎంటీఎస్ సర్వీసులు పాతబస్తీ, శంషాబాద్ వరకు విస్తరింపు
మెట్రో, ఎంఎంటీఎస్లో మహిళలు, వృద్ధులకు ఉచిత ప్రయాణం
అర్హత కలిగిన అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు
100 యూనిట్ల లోపు గృహాలకు కరెంట్ ఉచితం
80గజాలలోపు ఉన్న ఇళ్లకు ట్యాక్స్ రద్దు
ఉచితంగా 30వేల లీటర్ల మంచి నీరు
జీహెచ్ఎంసీ లైబ్రరీలలో దివ్యాంగులకు ఉద్యోగాలు
Tags:50,000 aid to flood victims