తిరుమలలో 74,995 వేల మందికి శ్రీవారి దర్శనం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వరకు 74,995 వేల మంది దర్శించుకున్నట్లు ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో స్వామివారికి తలనీలాలు సమర్పించిన వారు 38,663 వేల మంది ఉన్నారు. స్వామివారి ఆదాయం రూ.3.60 కోట్లు లభించిందని పేర్కొన్నారు. స్వామివారి దర్శనానికి సుమారు 24 గంటల నుంచి 29 గంటల సమయం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండ చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Tags; 74,995 thousand people have darshan of Srivari in Tirumala
