శ్రీచైతన్య కాలేజీ సిబ్బందిపై కేసు నమోదు
రంగారెడ్డి ముచ్చట్లు:
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎన్. సాత్విక్ ఆత్మహత్య నేపధ్యంలో మృతుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కాలేజీకి సంబంధించిన ఆచార్య, కృష్ణారెడ్డి, నరేష్ లపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసారు. సాత్విక్ మంగళవారం రాత్రి క్లాస్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాలేజీలో ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు తోటి స్టూడెంట్స్ ఆరోపించారు. సాత్విక్ ను గమనించి సిబ్బందికి చెప్పినా పట్టించుకోని వారు అంటున్నారు. చివరకు సాత్విక్ ను విద్యార్దులే అసుపత్రికి తరలించారు. అంతలోపే సాత్విక్ మృతి చెందాడు.
Tags: A case has been registered against the staff of Sri Chaitanya College