ఆత్మహత్యాయత్నంచేసిన దంపతులు
కొండాపురం ముచ్చట్లు:
27 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన భూమిని రెవెన్యూ అధికారులు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని భార్యాభర్తలు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన జిల్లాలో
చోటుచేసుకుంది. కోనరవుపెట కొండాపురం గ్రామానికి చెందిన మల్యాల నందం 15, సం,, లుగా జనశక్తి లో పనిచేసి, 27సం వయస్సులో పోలీసుల ముందు లొంగీ పోగా, అప్పటి ప్రభుత్వం
కొండాపురం శివారులో సర్వే నెంబర్ 116A లో ఏకరం 20 గుంటలు 2013 లో అప్పటి ఇవ్వడం జరిగింది, గత 10 సం లుగా ఆ భూమిని తను సాగు చేసుకుంటూ జీవన సాగిస్తూ ఉన్నాడు,అయితే
గత కొన్ని రోజుల క్రితం సర్వేయర్ కుమారు తనకు 50 వేలు ఇవ్వాలని లేదంటే ఇక్కడ భూమి లేదనీ రికార్డ్ రాస్తానని బెదిరిస్తున్నారని వాపోయాడు.
నెల రోజుల తరువాత రెవెన్యూ ఎమ్మార్వో తో పాటు అటవీశాఖ అధికారులు వచ్చి ఇక్కడ నికు భూమి లేదని ఇక్కడ సాగు చేయవద్దని బెదిరించి జెసిబి తో పొలం కంచే వేసే ప్రయత్నం లో నా భూమి లోకి
రావద్దటూ ఒక్కసారి నందం దంపతులు పద్మ ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు వారిని సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags: A couple who attempted suicide