పుంగనూరులో ఆర్ఎస్ఎస్ చే భారీ ర్యాలీ
పుంగనూరు ముచ్చట్లు:
పట్టణ పురవీధుల్లో శుక్రవారం సాయంత్రం ఆర్ఎస్ఎస్ వారిచే భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు జనార్ధన్, త్రిమూర్తిరెడ్డి, ముల్లంగి రవీంద్రనాథ్, వినాయక్ ల ఆధ్వర్యంలో కార్యకర్తలు యూనిఫాం ధరించి హిందూ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. హిందూబంధువులు , సంఘప్యాంట్, తెల్లచొక్కా, పట్టా, టోపి, పదవేష్ లు తీసుకుని పురవీధుల్లో ప్రదర్శన చేయడం పలువురిని ఆకట్టుకుంది. సమావేశాన్ని నిర్వహించి, హిందూమతాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వెంకటేష్, పరమేష్, రమేష్, దీపక్, మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: A huge rally by RSS in Punganur
