Natyam ad

ఢిల్లీలోని షూ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ  ముచ్చట్లు:

 


ఢిల్లీలోని పీరాగర్హి ప్రాంతంలోని షూ ఫ్యాక్టరీలో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిందని అగ్నిమాపకశాఖఅధికారులు తెలిపారు. సంఘటనా స్థలంలో 30కిపైగా ఫైర్‌టెండర్లను మోహరించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. పీరాగర్హి మెట్రో స్టేషన్‌కు సమీపంలో ఉన్నబూట్లకు సంబంధించిన కర్మాగారంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

 

Tags:A major fire broke out in a shoe factory in Delhi

Post Midle
Post Midle