Natyam ad

విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్ర‌హాన్ని గుర్తింపు

న్యూ డిల్లీ  ముచ్చట్లు:

అంత‌రిక్షంలో వింత‌లూ, విశేషాలెన్నో.. మ‌న కంటికి క‌నిపించని అద్భుతాలెన్నో.. వీటిని శోధించేందుకు శాస్త్ర‌వేత్త‌లు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుల్లా శ్ర‌మిస్తూనే ఉంటారు. తాజాగా, యూనివ‌ర్సిటీ ఆఫ్ మాంట్రియ‌ల్‌కు చెందిన ఖ‌గోళ శాస్త్ర‌వేత్త‌లు విశ్వంలోని సుదూర ప్రాంతంలో భూమిని పోలిన కొత్త గ్ర‌హాన్ని గుర్తించారు. ఇది భూమి నుంచి వంద కాంతి సంవ‌త్స‌రాల‌ దూరంలో ఉంది. భూమికంటే సుమారు 70శాతం పెద్ద‌ది. దీనికి ‘టాయ్‌-1452బీ’ అని నామ‌క‌ర‌ణం చేశారు.ప‌రిశోధ‌న‌కు నేతృత్వం వ‌హించిన చార్లెస్ కాడియక్స్ ప్ర‌కారం..ఈ కొత్త గ్రహంపై సంవ‌త్స‌రం అంటే 11 రోజులే. ఇది రెండు న‌క్ష‌త్రాల చుట్టూ తిరుగుతున్న‌ది. ఇది భూమి కంటే ఐదు రెట్లు బరువైనది. ఈ గ్ర‌హంలో ఎక్క‌డ చూసినా ద‌ట్టంగా నీళ్లున్నాయి. గ్రహం మొత్తం బరువులో 30 శాతం వరకు మహా సముద్రమే ఉంది. అందుకే దీన్ని ‘స‌ముద్ర గ్ర‌హం’గా పిలువొచ్చ‌ని కాడియ‌క్స్ పేర్కొన్నారు. ఈ గ్ర‌హానికి తన నక్షత్రం నుంచి కాంతి అందుతుంది. ఇది తన రెండో నక్షత్రం చుట్టూ తిరిగేందుకు దాదాపు 1,400 ఏండ్లు పడుతుంది. కాగా, ఈ గ్రహంపై జీవం ఉందా? లేదా? అనేది ప‌రిశోధ‌కులు అంచ‌నాకు రాలేక‌పోయారు. దీనిపై ఇంకా విస్తృత ప‌రిశోధ‌న చేయాల్సి ఉంద‌ని కాడియ‌క్స్ తెలిపారు.

 

Tags: A new Earth-like planet has been discovered in the far reaches of the universe

Post Midle
Post Midle