నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ దాడులు
ఏలూరు ముచ్చట్లు:
ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఎసిబి అధికారులు దాడులు జరిపారు. మున్సిపల్ కార్పోరేషన్ లోని పట్టణ ప్రణాళిక విభాగంలో తనిఖీలు చేసారు. గత కొన్ని రోజులుగా ఏలూరు నగర పాలక సంస్థ పై వస్తున్న అవినీతి ఆరోపణలపై ఏసీబీ కొరడా ఝులూపించింది. ఈ దాడుల్లో ఎసిబి డీఎస్పీ టిఎస్ఆర్ కే ప్రసాద్, సీఐ లు ఎన్వీ భాస్కర్ రావు, కే నాగేంద్ర ప్రసాద్, మరియు సిబ్బంది పాల్గోన్నారు.
Tags: ACB raids in the municipal office

