Natyam ad

గౌతమ్ రెడ్డి కి ఆదాల సంప్రదాయ శ్రద్ధాంజలి.

ఉదయగిరి ముచ్చట్లు :
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి దివంగత మంత్రి గౌతమ్ రెడ్డికి సంప్రదాయ శ్రద్ధాంజలి ఘటించారు. ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాలలో గురువారం జరిగిన గౌతమ్ రెడ్డి కర్మ క్రతువుల్లో పాల్గొన్నారు.ఇందులో భాగంగా గౌతమ్ రెడ్డి తండ్రి మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి  ఆయన సోదరులు పృద్విరెడ్డి, విక్రమ్ రెడ్డి లను పరామర్శించి స్వాంతన పలికారు. గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున రెడ్డి, తండ్రి గౌతమ్ రెడ్డికి చేస్తున్న సంప్రదాయ కర్మ క్రతువులను కాసేపు కూర్చుని చూశారు. అనంతరం గౌతం రెడ్డి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, నరసింహారావు, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  ..
సుదీర్ఘమౌనం..
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి, ఆయన కుమారులు పృథ్వి రెడ్డి, విక్రమ్ రెడ్డి లను పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి ఎంపీ ఆదాలను ఆహ్వానించి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయనను ఎలా ఓదార్చాలో తెలియక ఆదాల మౌనం దాల్చారు. రాజమోహన్ రెడ్డి ఏం మాట్లాడాలో తెలీక మనలోని బాధను తనలోని ఉంచుకొని మౌనంగాఉండిపోయారు. ఇలా ఎవరికి వారు మౌనంగా ఉండిపోవడంతో అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. పలువురు ప్రముఖులు, గౌతమ్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఎంతో మంది అక్కడ ఉన్నా అదే పరిస్థితి. ఆ తర్వాత ఎంపీ ఆదాల రాజమోహన్ రెడ్డి తదితరులు కర్మ క్రతువుల్లో పాల్గొనేందుకు లేచారు. అంతవరకు అక్కడున్న మౌనం మాయమైంది.
 
Tags:Adala is a traditional tribute to Gautam Reddy.