Natyam ad

ఆగమోక్తంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ

– భక్తులకు దర్శనం ప్రారంభం

 

తిరుపతి ముచ్చట్లు:

Post Midle

తిరుపతి కపిలతీర్థంలో గల పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ మహాసంప్రోక్షణ ఆదివారం ఆగమోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, కుంభప్రదక్షిణ చేపట్టారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య మిథున లగ్నంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి కళావాహన, మహాసంప్రోక్షణ నిర్వహించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు   వేణుగోపాల దీక్షితులు, కంకణభట్టార్ శ్రీ సూర్యకుమార్ ఆచార్యులు, డెప్యూటీ ఈవో  దేవేంద్ర బాబు, ఏఈఓ   పార్థసారథి, సూపరింటెండెంట్  భూపతి, టెంపుల్ ఇన్స్పెక్టర్  రవికుమార్ పాల్గొన్నారు.

Tags; Agamoktanga Sri Lakshminarasimhaswamy Temple Mahasamprokshan

Post Midle