రామసముద్రంలో ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ
రామసముద్రం ముచ్చట్లు:
రామసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని ఎన్.ఎస్.ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణ పై ర్యాలీ నిర్వహించారు. స్థానిక కళాశాల నుంచి అంబెడ్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రజల కు అవగాహన కల్పించి. మానవహారం చేపట్టారు. అలాగే ‘ఎయిడ్స్ నివారణ, చర్యలు’ పై వ్యాసరచన, ఎలక్టీవ్, పోటీలు నిర్వహించి ప్రిన్సిపాల్ మురళీధర్ చేతుల మీదుగా గెలుపొందిన విద్యార్థుల కు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ అధికారి సత్యనారాయణ స్వామి, అధ్యాపకులు నాగరాజు, రవీంద్ర, చిరంజీవి, శివ, శ్రీలత, వేదవతి, లక్ష్మి శబరీష్ , వాలంటీర్ లు పాల్గొన్నారు.
Tags: Aids awareness rally in Ramasamudra