Natyam ad

ముస్లింలంతా వై.యస్.ఆర్.సిపి వెంటే..

– ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి

 

మైదుకూరు ముచ్చట్లు:

Post Midle

ఎమ్మెల్యే  సమక్షంలో 70 ముస్లిం కుటుంబాలు వై.యస్.ఆర్.సిపి లో చేరిక
—మైదుకూరు టిడిపి మైనారిటీ పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ ఎద్దుల బండి షరీఫ్ కు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి .రాష్ట్రంలో ముస్లింలంతా వై.యస్.ఆర్.సిపి వెంటే ఉన్నారని ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డులో బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో 70 ముస్లిం కుటుంబాలు టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లో చేరాయి.ఈ సందర్భంగా టిడిపి మైనారిటీ విభాగం పట్టణ ఉపాధ్యక్షుడు షేక్ ఎద్దుల బండి షరీఫ్, మైదుకూరు జడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ మాబు చాన్ తదితర 70 కుటుంబాల వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలు వేసి వైఎస్ఆర్సిపి లోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామి రెడ్డి గారు మాట్లాడుతూ, ముస్లింలు అభివృద్ధి చెందారు అంటే దివంగత నేత వైయస్సార్, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అని పేర్కొన్నారు. వైఎస్ఆర్ అమలు చేసిన నాలుగు శాతం రిజర్వేషన్లతో అనేకమంది ముస్లిం యువత ఉన్నత చదువులు చదివారని, ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు.

 

 

14, 15 వార్డులు ఉన్న 8వ సచివాలయంలో 538 మందికి రూ. 5.5 కోట్ల రూపాయలు పింఛన్ కానుకగా అందించారని తెలిపారు. 307 మంది ఇల్లు లేని నిరుపేదలకు పక్కా ఇల్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. చేయూత కింద రూ. 1.7 కోట్లు, ఆసరా కింద రూ. 1.2 కోట్లు అందించినట్టు వివరించారు. సచివాలయ పరిధిలో సంక్షేమం అభివృద్ధి కింద రూ. 20 .36 కోట్లు ఖర్చు చేసినట్టు ఎమ్మెల్యే వివరించారు. చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయడని చేసేవారిని అడ్డుకుంటూ ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే సంక్షేమం అభివృద్ధి ఉంటాయని తెలిపారు. మే 13వ తేదీ ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. జూన్ 10వ తేదీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం తధ్యమని పేర్కొన్నారు.

 

 

70 కుటుంబాలు చేరిక ..
14వ వార్డుకు చెందిన షేక్ ఎద్దుల బండి మాబు షరీఫ్, పెద్దకాజా, మైను, సర్దార్, దస్తగిరి భాష, షఫీ, అబ్దుల్ రసూల్ ,ఆసిఫ్, హుస్సేన్, పీరా సాబ్ గారి మాబువల్లి, షేక్ సుమన్, షేక్ జావిద్, షేక్ అబ్దుల్, షేక్ షరీఫ్ ,షేక్ అన్వర్, మాబు చాన్, దిల్షాద్ గౌసియా కరీమును హసీనా మాబు చాన్ అక్రమున్నీసా మున్ని కరిష్మా కదిరి ఇమాంబి రమీజా ఆరిఫ్ అనీఫ్ గౌస్ ఇమామ్ నజీర్ తదితరులంతా టిడిపి నుంచి వైఎస్ఆర్సిపి లోకి చేరారు.ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ మదీనా దస్తగిరి, వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షుడు కేపీ లింగన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ మాబు షరీఫ్, బ్యాటరీ ఖాదర్, ట్రాక్టర్ గౌస్ ,గౌస్ పీర్ నాయబ్ రసూల్, గౌస్ ,కిరణ్మయి, గోశెట్టి రామచంద్ర ,పఠాన్ చాంద్ బాషా,విశ్వనాధ ఆచారి,తదితరులు పాల్గొన్నారు.

Tags: All Muslims are with YSRCP.

Post Midle