గర్భిణి మాధవి మృతిపై విచారణ జరపాలి
-కలెక్టర్ ను లేఖ ద్వారా కోరిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు
మంథని ముచ్చట్లు:
మంథని మాతా శిశు వైద్యశాలలో ప్రసూతి సేవల కోసం వచ్చిన మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన తొట్ల మాధవి అలియాస్ నైనవెని సంధ్యారాణి వైద్యుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయారనికుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నందున దీనిపై ప్రత్యేక విచారణ చేసి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మంథని శాసనసభ్యులు దుదిల్ల శ్రీధర్ బాబు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ను లేఖ ద్వారా కోరారు.మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన తొట్ల మాధవి అలియాస్ నైనవెని సంధ్యారాణి రెండవ కాన్పు కోసం మంథని ప్రభుత్వ మాత శిశు ఆస్పత్రిలో ప్రసూతి సేవలో కోసం బుధవారం ఉదయం వచ్చిఅడ్మిట్ కాగా, ఆపరేషన్ నిమిత్తమై మాత శిశు ఆస్పత్రిలోని ప్రసూతి వైద్యులు, అనస్థీషియా డాక్టర్ ఇతర నర్సులు చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లి ఇంజక్షన్లు వేసిన తర్వాత పిట్స్రాగానే వెంటనే అంబులెన్స్ ఇచ్చి పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి కి వైద్యులు పంపించడం వల్ల మార్గమధ్యములోనే తోట్ల మాధవి చనిపోయిందని ఇది పూర్తిగా వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆయనఆరోపించారు. వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తపరుస్తున్నందున దీనిపై వెంటనే పూర్తి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం తరఫునన్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Tags; An inquiry should be conducted into the death of pregnant Madhavi
