చెరువులో పడి వృద్దురాలు మృతి
అన్నమయ్య ముచ్చట్లు:
రామసముద్రం మండలం చెంబకూరు చెల్ల చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడి వృద్ధురాలు మృతి చెందింది. చెరువులో పడి ఉన్న వృద్ధురాలు మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలు రామసముద్రం మండలం, చెంబకూరు గ్రామం, కోట వీధికి చెందిన గని సాబ్ బార్య శంషాద్ (80) సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం కొరకు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామసముద్రం ఎస్సై రవీంద్రబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Tags: An old woman died after falling into a pond

