ఘనంగా ఎస్వీ ఉన్నత పాఠశాల వార్షికోత్సవం
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఉన్నత పాఠశాల 137వ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన దేవస్థానం విద్యాశాఖ అధికారి డా.ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలన్నారు.ప్రత్యేక అతిథిగా విచ్చేసిన స్విమ్స్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి.వనజాక్షమ్మ మాట్లాడుతూ, విద్యార్థులు చక్కటి ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు. ప్రధానోపాధ్యాయురాలు జె.సంధ్య వార్షిక నివేదికను వినిపించారు.హెచ్డిపిపి కో-ఆర్డినేటర్ డా.ఇజి.హేమంత్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ కుమార్, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె.చంద్రశేఖర్, పూర్వ విద్యార్థి ఎ.సంపత్కుమార్, టేక్వాండో కోచ్ గోపినాయుడు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు శ్రీ కె చంద్ర శేఖర్ వివిధ అంశాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రూ 60 వేల నగదు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
Tags: Anniversary of SV High School