Natyam ad

హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం..

రెండు డీసీఎంలు దగ్ధం

రంగారెడ్డి ముచ్చట్లు:

Post Midle

నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్దేవ్పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.

రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన

వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది..

Tags;Another huge fire in Hyderabad

Post Midle