హైదరాబాద్లో మరో భారీ అగ్నిప్రమాదం..
రెండు డీసీఎంలు దగ్ధం
రంగారెడ్డి ముచ్చట్లు:

నగరంలో మరో అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. మైలార్దేవ్పల్లి శాస్త్రిపురంలో ఓ ప్లాస్టిక్ గోదాంలో మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో గోదాంలో ఉన్న రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ఆస్తి నష్టానికి సంబంధించిన
వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది. రెండు డీసీఎంలతో పాటు గోదాంలో విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యింది..
Tags;Another huge fire in Hyderabad
