అమిత్ షా పర్యటనపై గిరిజనుల వ్యతిరేక నిరసనలు
సుక్మా ముచ్చట్లు:
చత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెలలో బస్తర్ ప్రాంతంలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో గిరిజనులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. బీజాపూర్ సుకుమా జిల్లాల సరిహద్దు ప్రాంతం దండకారణ్యంలో ప్రజలు అమిత్ షా పర్యటన నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ మరియు అమిత్ షా తోపాటు ఐజి సుందర్ రాజ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. జనవరి నెలలో ఈ ప్రాంతంలో జరిగిన వైమానిక దాడులను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నిరసనలలో మావోయిస్టులు కూడా పాల్గొన్న వీడియోలు హల్చల్ చేస్తున్నాయి

Tags;Anti-tribal protests against Amit Shah’s visit
