పుంగనూరులో 30న ఏపి కబడ్డీ జట్టు ఎంపిక
పుంగనూరు ముచ్చట్లు:
ఆంధప్రదేశ్ జూనియర్ బాలుర కబడ్డీ జట్ల ఎంపిక కార్యక్రమం ఈనెల 30న బాపట్లజిల్లా నగరంలో జరుగుతుందని జిల్లా కార్యదర్శి పద్మావతి తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎస్వీఆర్ఎం కళాశాలలో ఉదయం 9 గంటలకు జిల్లా అధ్యక్షుడు కెసి.మధు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. పోటీల్లో పాల్గొనే వారు తమ ఆధార్కార్డు, మ్యాట్షూ తో హాజరుకావాలన్నారు. క్రీడాకారులు 2002 నవంబర్ 20 తరువాత జన్మించి ఉండాలని సూచించారు. వివరాలకు సెల్నెంబరు:7569630466, 9000042705 లను సంప్రదించి, వివరాలు తెలుసుకోవాలన్నారు.
Tags: AP Kabaddi team selection on 30th in Punganur