పుంగనూరులో వలంటీర్ల పోస్టులకు ధరఖాస్తు చేయండి -కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని సచివాలయాలలో ఖాళీగా ఉన్న వార్డు వలంటీర్ల పోస్టులకు ఆసక్తి గల వారు ధరఖాస్తు చేయాలని కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి బుధవారం కోరారు. ధరఖాస్తులను ఈనెల 14 వరకు స్వీకరిస్తామన్నారు. 15న పరిశీలించి, 20న ఇంటర్వ్యూలు నిర్వహించి 26 నుంచి నియామకాలు అందజేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Tags: Apply for volunteer posts in Punganur – Commissioner Narasimhaprasad Reddy