Natyam ad

ముఖ్యమంత్రి  వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  తిరుపతి ,తిరుమల పర్యటన ఏర్పాట్లు

-బందోబస్తు అధికారులతో భద్రతపై సమీక్ష నిర్వహించించిన జిల్లా ఎస్పీ  పి పరమేశ్వర రెడ్డి ఐపీఎస్.,

 

తిరుపతి  ముచ్చట్లు:

Post Midle

❇️ సి.యం పర్యటన నేపధ్యంలో బందోబస్తు అధికారులతో సమీక్షా సమావేశం.

❇️ సి.యం పర్యటనకు కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు.

❇️ తిరుపతి తిరుమలలో సి.సి. కెమరాలతో నిరంతర పర్యవేక్షణ.

❇️ రంగంలో ప్రత్యేక భద్రతా దళాలు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు.

❇️ చిన్న పొరపాటు జరగకుండా పూర్తిస్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం.

❇️ పర్యటన ప్రాంతాలలో ప్రత్యేక భలగాలతో అణువణువు తనికీలు.

❇️ ప్రధాన కూడలీలలో బ్యారికేట్స్ ఏర్పాటు.

❇️ రూఫ్ టాప్ పై ప్రత్యేక దృష్టి పెట్టి భద్రత పెంచాలని అధికారులకు సూచన.

❇️ అత్యవసర వాహనాలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఏర్పాటు. హాస్పిటల్ కు వచ్చు రోగులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు.

❇️ ప్రతి బందోబస్తును కొత్తదిగానే భావించి విధులు నిర్వర్తించాలి. అందరు అప్రమత్తంగా ఉండి పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచనలు.

రాష్ట్ర ముఖ్యమంత్రి   వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  తిరుపతి తిరుమల పర్యటన నేపధ్యంలో బందోబస్తు అధికారులతో బద్రత పై సమీక్ష తిరుమల పోలిస్ కంట్రొల్ రూమ్ నందు నందు జిల్లా ఎస్పీ  పి పరమేశ్వర రెడ్డి ఐపీఎస్  నిర్వహించారు.ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ లు అడ్మిన్ వెంకట్రావు, L&O కులశేఖర్, తిరుమల మునిరామయ్య , అధికారులు, డి.యస్.పి లు, సి.ఐ లు, యస్.ఐ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ గౌ” రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 18 వ తేది న తిరుపతి నందు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని తిరుమలకు శ్రీ వారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి రానున్న నేపధ్యంలో సమీక్ష అనంతరం ఈ రోజు తిరుపతి రేణిగుంట విమానాశ్రయం నుండి రిహార్సల్ కాన్వాయ్ ను తిరుమల వరకు సి.యం గారు పర్యటించు ప్రాంతాలలో నిర్వహించడం జరిగిందనీ అన్నారు.

 

 

 

రేణిగుంట విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగింది. అలాగే పర్యటన రహదారుల యందు అవసరమున్న ప్రతి చోట బ్యారికేట్స్, స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసున్నాము. భద్రత దృష్ట్యా కార్యక్రమం ప్రాంతాల చుట్టూ రూఫ్ టాప్స్ పై దృష్టి సారించి భద్రతను పెంచుతున్నామన్నారు.అత్యవసర వాహనాలకు మరియు హాస్పిటల్ కు వచ్చు రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే తిరుమల యందు యాత్రికులకు, భక్తులకు కూడా ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు పర్యటించు సమయం నందు కొన్ని ప్రధాన ప్రాంతాల యందు కొంత సమయం వరకు ట్రాఫిక్ ను మళ్ళించడం జరుగుతుంది. ప్రజలు దీనికి సహకరించాలని తెలిపారు.ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది బందోబస్తును ప్రతిష్టాత్మకంగా తీసుకొని విధులు నిర్వర్తించాలనీ. ప్రతి బందోబస్తును కొత్తగా చేస్తున్నామనే ఉద్దేశంతో జాగ్రత్తగా నిర్లక్ష్యం చేయకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. విధుల యందు అలసత్వం వహిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రముఖులకు భద్రత కల్పించడం మన విధి, మన కర్తవ్యంగా భావించి పని చేయాలన్నారు.

 

 

 

జిల్లా సరిహద్దు, ప్రధాన రహదారులపై చెక్ పోస్టులను ఏర్పాటు చేసి భద్రతను పెంచుతున్నాము. అలాగే తిరుమల అప్ ఘాట్, డౌన్ ఘాట్ రోడ్డుల యందు బి.డి టీం, డాగ్ స్క్వాడ్, ఆర్.ఓ.పి బృందాలచే విస్తృతంగా అణువణువు తనికీలు చేపట్టి కట్టు దిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటామని అన్నారు.అధికారులు నిరంతరం కార్యక్రమ ప్రదేశాలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి ఎప్పటికప్పడు సూచనలు, సలహాలిస్తూ చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం లేకుండా ఎలాంటి ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకోకుండా చూడాలని అధికారులకు సూచనలు చేసారు.ప్రతి ఒక్కరు మనం చేసే వృత్తి మనకు దైవంగా భావించి విధుల యందు అప్రమత్తంగా ఉండి పర్యటనను విజయవంత చేయాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  పి పరమేశ్వర రెడ్డి ఐపీఎస్., అధికారులను ఉద్దేశించి భద్రతపై పలు సూచనలు, సలహాలు చేసారు.

 

Tags:Arrangements for Chief Minister YS Jagan Mohan Reddy’s visit to Tirupati and Tirumala

Post Midle