పుంగనూరులో 26న గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను కమిషనర్ నరసింహప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. బుధవారం ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని సర్కూలర్ జారీ చేశారు. అలాగే పట్టణంలో మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు ప్రతి ఒక్కరు హాజరుకావాలని కమిషనర్ కోరారు. అలాగే గత ఐదు సంవత్సరాలుగా జరుగుతున్న నిత్యజాతీయ గీతాలాపనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరారు.
Tags: Arrangements for Republic celebrations on 26th in Punganur