ప్లాస్టిక్ నిషేధము అమలు పై అవగాహన సదస్సు
రవి చంద్రా రెడ్డి. మున్సిపల్ కమిషనర్
నంద్యాల ముచ్చట్లు:
ప్లాస్టిక్ నిషేధము పూర్తి స్థాయిలో ఆమలు చేయుట కొరకు నంద్యాల మున్సిపల్ కమీషనర్ శ్రీ చింత రవి చంద్రారెడ్డి బుధవారం నాడు సమవేశము నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులకు అవగాహన కల్పించారు . ప్రతి సచివాలయము నుండి అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరి, సానిటేషన్ సెక్రటరీ, ప్లానింగ్ సెక్రటరి మహిళ పోలిసు కలిసి టాస్క్ ఫోర్స్ కమీటిగా ఏర్పాటు చేయడమైనదని వారు అందరు కలిసి ప్రతి రోజు తమ వార్డు పరిధిలో ప్రజలకు దుకాణాలదారులకు ప్లాస్టిక్ నిషేదము పై అవగాహన కల్పించవలసిందిగా తెలియజేశారు. ఈ కార్యక్రమము నందు ఆసిస్టెంట్ కమీషనర్ వెంకట దాసు , డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మధు కుమార్ , టౌన్ ప్లానింగ్ అధికారులు, సచివాలయ సెక్రటరీలు పాల్గోన్నారు.

Tags; Awareness conference on implementation of plastic ban
