Natyam ad

పుంగనూరులో ఓటర్ల నమోదుపై అవగాహన ర్యాలీ

పుంగనూరు ముచ్చట్లు:

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలని కమిషనర్‌ నరసింహప్రసాద్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని భగత్‌సింగ్‌ కాలనీలో మహిళలు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఓటరుగా నమోదు చేసుకోండి , ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి అనే నినాదానాలు చేశారు. కమిషనర్‌ మాట్లాడుతూ ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకాకుండ నిర్భయంగా ఓటరుగా నమోదై, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిటి మిషన్‌ కోఆర్డినేటర్‌ మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Awareness rally on voter registration in Punganur

Post Midle