Date:03/12/2020
సదుం ముచ్చట్లు:
తుఫాన్ ప్రభావంతో తిరిగి వర్షాలు ప్రారంభంకావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జెడ్పిటిసి సోమశేఖర్రెడ్డి సూచించారు. ఎస్ఐ ధరణి , ధరతో కలసి మండలంలోని పలు వాగులు, చెరువులు, కాజ్వేలను గురువారం పరిశీలించారు. నివర్ తుఫాన్ మండలంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని , మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారని జెడ్పిటిసి చెప్పారు. ప్రమాదకరంగా ఉండే చెరువులు వద్ద, నీటి ప్రవాహాల వద్ద ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు.
ఢిల్లీ రైతులకు మద్దతుగా సంఘీభావ ర్యాలీ
Tags; Be vigilant with rains