Natyam ad

కోడి దొంగలతో బెంబేలు

ఏలూరు ముచ్చట్లు:

 

 

సంక్రాంతి పండుగ వచ్చింది ఉంటే గుర్తొచ్చేది కోడి పందాళ్లు… గోదావరి జిల్లాలో భారీ ఎత్తున కోడిపందాలు జరుగుతాయి. పండుగ మూడు రోజులు పందాల పేరుతో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుంది. అంత విలువైన పందాల కోసం పోటీపడే పందెం కోళ్ళు సైతం లక్షల రూపాయల విలువ కలిగి ఉంటాయి. ఒక జాతి పందెంకోడి తయారీకి సుమారు రూ 25 వెలు వరకు ఖర్చు అవుతుంది. అలా తయారు చేసిన కోడిపుంజులను వాటి రంగు, పోరాట పటిమ, వాటి ఎత్తు ఇలా అనేక రకాలుగా వాటిని వేరుచేసి సుమారు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకు వాటిని అమ్ముతారు. ప్రస్తుతం చాలా చోట్ల పందెంకోడి పుంజుల పెంపకం జీవనాధారంగా మారింది. అలా వాటిపై జీవిస్తున్న పలువురుకి కొందరు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళనతో వారు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. ఇటీవల పందెం పుంజులు దొంగతనాలు జోరుగా సాగుతున్నాయి. ఎంతో కష్టపడి గుడ్డు దశ నుంచి పొదిగిన తర్వాత ఒకరోజు పిల్ల దగ్గర నుంచి సుమారు ఒక సంవత్సరం కాలం వరకు వాటిని పెంచి పోషించి, వాటికి బలవర్ధకమైన ఇస్తూ, యుద్ధ నైపుణ్యంలో తర్ఫీది ఇచ్చిన కోడిపుంజులను రాత్రికి రాత్రే దొంగలు ఎత్తుకెళుతున్నారు. అందులో మరీ ముఖ్యంగా సంక్రాంతికి రెండు నెలల ముందు ఈ పందెంకోడి పుంజుల దొంగతనాలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో ఎంతో శ్రమించి, వాటిని పెంచి, వాటి పెంపకంపై లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పందెం పుంజుల పెంపకం దారులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల నూజివీడు పరిసర ప్రాంతాల్లో పందెం పుంజుల దొంగతనాలతో పెంపకం దారులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

 

 

Post Midle

నూజివీడు మండలం రావిచర్ల గ్రామానికి చెందిన మోత్కుమిల్లి శ్రీనివాసరావు ఎంఎస్పీ కాలవ సమీపంలో ఓ పొలంలో ఎంతో ఖరీదైన జాతి కోడిపుంజులను పెంచుతున్నారు. రాత్రి పగలు కూడా శ్రీనివాసరావు అతని భార్య రాత్రి పగలు కూడా వాటిని సంరక్షిస్తూ అక్కడే నివసిస్తున్నారు. ముఖ్యంగా సంక్రాంతి సమీపించడంతో ఇప్పటికే కొన్ని కోడిపుంజులకు పందేలలో తర్ఫీదు తో పాటు, వాటిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ఆ కోళ్లపై దొంగల ముఠా కన్ను పడింది. భార్యాభర్తలు ఇద్దరే మకాం దగ్గర ఉండటం వారు గమనించారు. అంతేకాక ఆ కోళ్ల మకాం కూడా ఊరికి దూరంగా ఉండటంతో చోరీకి ప్లాన్ చేశారు.. రెండు బైకులు, ఆటో వేసుకుని అంత రాత్రి శ్రీనివాసరావు కోళ్ల మకాం దగ్గరకు వెళ్లి భార్యాభర్తలు ఇరువురి గొంతు పై కత్తి పెట్టి బెదిరించారు.. వారు మకాంలో పెంచుతున్న సుమారు రూ.4 లక్షల విలువగల 11 జాతి పుంజులను ఆటోలో వేసుకుని అక్కడ నుంచి పరారయ్యారు. కోళ్ల దొంగతనం ఘటనపై బాధితులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శ్రీనివాసరావు అతనీ భార్య పద్మావతిని దొంగతనం జరిగిన తీరును గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. వారు తమ వెంట కత్తులు తీసుకువచ్చి తమ గొంతు పై పెట్టి చంపేస్తామని బెదిరించి కోళ్లను అపహరణ చేసినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Tags: Bembelu with chicken riots

Post Midle