అవినాష్ అరెస్ట్ పై బెట్టింగ్
కడప ముచ్చట్లు:
కోళ్ల పందేలు, క్రికెట్ పై బెట్టింగ్ ల గూర్చి విన్నాం. ఫలానా పార్టీ లేదా ఫలానా అభ్యర్థి గెలుపోటములకు సంబంధించి బెట్టింగ్లు కట్టడం మామూలే కానీ తెలుగునాట ఓ వింత బెట్టింగ్ లు ప్రారంభమయ్యాయి. అవి కూడా లక్షల్లో బెట్టింగ్ లు జరుగుతున్నట్టు వార్తలు అందుతున్నాయి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారన్న వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి స్వత ఇలాఖా కడపలో బెట్టింగులు జోరందుకున్నాయి..కొందరు ఆయనను అరెస్ట్ చేస్తారని కొందరు, చేయరంటూ మరికొందరు పందేలు కాస్తున్నారు.. సీఎం జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంతో పాటు అవినాష్ రెడ్డి నివాసముండే పులివెందులలో కూడా బెట్టింగులు జరుగుతున్నట్లు తెలుస్తోంది..వేల రూపాయల నుంచి లక్షల రూపాయల మధ్య బెట్టింగ్లు నడుస్తున్నట్లు సమాచారం.. వివేకా హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సీబీఐ అధికారులు అవినాష్ తండ్రి భాస్కర్ రెడ్డి, అతని అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరో వైపు అరెస్ట్ చేయవద్దని కావాలంటే కస్టోడీయల్ ఇంటరాగేషన్ చేసుకోవచ్చునని అవినాష్ రెడ్డి తరపు లాయర్ నిరంజన్ రెడ్డి న్యాయమూర్తిని కోరారు. సుప్రీం కోర్టు గతం లో ఇలాంటి ఆదేశాలు ఇచ్చిందన్నారు. ఇలంటి ఆదేశాలు ఇస్తే మేము తప్పకుండా పాటీస్తామన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని ఆయన తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ నిందితుడిగా పేర్కొనలేదని అవినాష్ పేరు పెట్టలేదని ఆయన తరలు లాయర్ వాదించారు.
దస్తగిరికి కుట్రపూరితంగా బెయిల్ ఇచ్చారని.. నేరంలో ప్రత్యక్షంగా పాల్గొన్న నేరగాడికి బెయిల్ ఇవ్వడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. దస్తగిరి స్టేట్ మెంట్ పరస్పర విరుద్దంగా ఉందన్నారు.ఐదు రోజుల తర్వాత ఇచ్చిన 160 స్టేట్మెంట్లో గుర్తు చేసుకుని చెబుతున్నానని అవినాష్, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివ శంకర రెడ్డి పేర్లు చెప్పాడు. ఇందులోనే ఈ వ్యవహారం అంతా అవినాష్ చూసుకుంటాడు.. మిగతా డబులు కూడా ఇస్తారని చెప్పాడు. దస్తగిరి బెయిల్ పిటిషన్ సీబీఐ ఎక్కడా అపోజ్ చేయలేదు. దస్తగిరిని ముందుగానే ప్లాన్ చేసి సీబీఐ అవినాష్ రెడ్డి పేరు చెప్పేలా చేసింది. సీబీఐ చెప్పిన వాటికి దస్తగిరి అంగీకరించి అప్రూవర్గా మారాడు. దస్తగిరి బెయిల్లో మెరిట్స్ పరిగణలోకి తీసుకోలేదు. మర్డర్ కేసు ప్రత్యేక్షంగా పాల్గొన్న నిందితుడికి బెయిల్ మంజూరు చేయడం నేను ఎక్కడా చూడలేదు. ఇప్పటి వరకూ వివేకా హత్య కేసులో సీబీఐ రెండు ఛార్జ్ షీట్లు వేసింది. రెండు ఛార్జ్ షీట్లలో కానీ రిమాండ్ రిపోర్టులో కానీ ఎక్కడ అవినాష్ పేరు గానీ భాస్కర్ రెడ్డి పేరు కానీ ప్రస్తావించలేదు’ అని అవినాష్ తరఫు లాయర్ కోర్టుకు వివరించారు.వివేకా హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారని సునీత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

ఇంటిని క్లీన్ చేసిన మహిళ స్టేట్ మెంట్ విషయంలో ఇప్పటికే ఆమెను ప్రభావితం చేశారన్నారు. అవినాష్ పై ఎలాంటి కేసులు లేవని అబద్దం చెప్పారని.. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం నాలుగు క్రిమినల్ కేసులు ఉన్నాయన్నారు. సాక్షుల్ని ప్రభావితం చేయడంలో అవినాష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వంనియమించిన సిట్ ను ఆయన ప్రభావితం చేశారన్నారు. సీఐ శంకరయ్యను కూడా ప్రభావితం చేసి.. స్టేట్ మెంట్ ఇచ్చేవిషయంలో వనక్కి తగ్గేలా చేసి.. ఆయనకు పోస్టింగ్ ఇచ్చారని సునీత తరలు లాయర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
Tags:Betting on Avinash’s arrest
