మే 7న ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ
తిరుపతి ముచ్చట్లు:
నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం జూన్ 7వ తేదీ ఉదయం శాస్త్రోక్తంగా భూమి పూజ జరుగనుంది.బుధవారం ఉదయం 6-30 గంటల నుండి 7-30 గంటల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బా రెడ్డి, ఈవో ఎవి ధర్మారెడ్డి వేద మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ నిర్వహంచనున్నారు.ముంబై లో శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీ కి 10 ఎకరాల భూమి కేటాయించింది. ఈ భూమిలో దాదాపు రూ 100 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం నిర్మించడానికి రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భూమి పూజ కార్యక్రమంలో ఆయన కూడా పాల్గొననున్నారు.
Tags:Bhumi Puja for construction of Srivari temple in Mumbai on 7th May