బీజేపీ ఛీఫ్ బండి సంజయ్
హైదరాబాద్ ముచ్చట్లు:
బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థుల కష్టాలు తెలుసుకునెందుకు బయలుదేరుతున్నా. ఒక్క ట్రిపుల్ ఐటీ నిర్వహణ కూడా కేసీఆర్ కి సాధ్యం కావడం లేదు. ఇంకా ట్రిపుల్ ఐటి ఎలా మంజూరు చేస్తారు ? సిల్లి ముఖ్యమంత్రి కి సమస్యలు సిల్లిగా కనిపిస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సమస్యలు సిల్లి అయితే… ఎందుకు పరిష్కరించలేదు. టిఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారడం.. ఆ వెంటనే విఆర్ఎస్ పొందటం ఖాయమని అయన అన్నారు. ట్రిపుల్ ఐటి విద్యార్థులకు నీళ్లు, పవర్ కట్ చేయడం మూర్ఖత్వం. స్థానిక అధికారులు విద్యార్థులను భయపెడుతున్నారు. గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ఇదే విధంగా వ్యవహరిస్తే… కొత్త వ్విఈడీద్యా సంస్థలు మంజూరు కష్టంగా మారుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆస్తులు ద్వం0సం చేయడం మానుకొని… ఆలస్యంగానైనా సమస్యలు గుర్తించడం మంచిదే నని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
Tags: BJP chief Bandi Sanjay

