పుంగనూరులో బిజెపి దిష్టిబొమ్మ దగ్ధం
పుంగనూరు ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో బిజెపి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. శనివారం ఎంఆర్పిఎస్ నాయకులు నరసింహులు, ఫృద్వీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరసన తెలిపి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, నాగభూషణం, వెంకట్రమణ, గోవిందు, గంగిరెడ్డి, మురళి, రాఘవ, బాలాజి, గణేష్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Tags: BJP effigy burnt in Punganur