బిజెపి ప్రభుత్వం పేదలకు ఎంతో వరం
బిజెపి అచ్చంపేట నాయకులు శ్రీకాంత్ బీమా
నాగర్ కర్నూల్ ముచ్చట్లు:
బల్మూరు మండలం చెన్నారం గ్రామంలో శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్ శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా బిజెపి అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ నాయకుడు శ్రీకాంత్ బీమా రావడం జరిగింది. శ్రీకాంత్ భీమా మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. పేదలకు ముఖ్యంగా ఆరోగ్యపరంగా ఎంతగానో ఉపయోగపడే ఆయుష్మాన్ భారత్ పథకం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందకుండా చేస్తుందని, అదేవిధంగా జీవిత బీమా పథకాలు కూడా చాలా ఉన్నప్పటికీ వాటిని ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనదని శ్రీకాంత్ చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టిన పథకాలను కూడా ప్రజలకు అందించడంలో జాప్యం చేస్తూ విఫలమైనదని శ్రీకాంత్ భీమ చెప్పడం జరిగింది. ఈ కార్నర్ మీటింగ్ సమావేశానికి రాష్ట్ర మైనారిటీ మోర్చా నాయకులు హమీద్ , బీజేవైఎం అచ్చంపేట అసెంబ్లీ కో కన్వీనర్ నోముల బాలకృష్ణ యాదవ్ , శక్తి కేంద్ర ఇన్చార్జ్ ఆకునమోని మల్లేష్ , బూత్ అధ్యక్షులు అల్లోజి, కే మల్లేష్, అశోక్ రెడ్డి, మరియు బిజెపి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags; BJP government is a boon to the poor