భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె ముచ్చట్లు:
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్ర ల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు అన్ని భక్తుల రద్దీతో జనసంద్రంగా మారిమది. ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా ముస్తాబు చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కేలు తీరిన భక్తులు అమ్మవారికి చలిపిండి, చల్లముద్దతో దీపాలు వెలిగించి, వెహోక్కులు చెల్లించి, పూజలు చేశారు. భక్తులకు ఆలయ కమిటి చైర్మన్ మిద్దింటి శంకరనారాయణ ఆధ్వర్యంలో పవిత్ర తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Tags: Boyakonda chattering with devotees