Date:23/02/2021
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వరకు జరుగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కోవిడ్ -19 నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
04-03-2021(గురువారం) ధ్వజారోహణం(మీనలగ్నం) హంస వాహనం
05-03-2021(శుక్రవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
06-03-2021(శనివారం) భూత వాహనం సింహ వాహనం
07-03-2021(ఆదివారం) మకర వాహనం శేష వాహనం
08-03-2021(సోమవారం) తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
09-03-2021(మంగళవారం) వ్యాఘ్ర వాహనం గజ వాహనం
10-03-2021(బుధవారం) కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
11-03-2021(గురువారం) రథోత్సవం(భోగితేరు) నందివాహనం
12-03-2021(శుక్రవారం) పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
13-03-2021(శనివారం) శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,
సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.
ఈ సందర్భంగా ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు ఆలయంలో ఏకాంతంగా వాహన సేవలు నిర్వహిస్తారు.
ఫిబ్రవరి 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం :
శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 28వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.
ఈ సందర్భంగా ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది. మధ్యాహ్నం 3.00 గంటల నుండి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు.
వైఎస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
Tags: Brahmotsavas of Sri Kapileswaraswamy in solitude from March 4 to 13