ఫైనాన్సర్ దారుణ హత్య
మేడ్చల్ ముచ్చట్లు:
నగరశివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు దగ్గర ఓ వ్యక్తి రక్తసిక్తంగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు దుండిగల్ కు చెందిన వెంకటేష్ గౌడ్( 40) సంవత్సరాల వ్యక్తి గా గుర్తించారు.ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుండి బయటికి వెళ్లినట్లు, రాత్రే శరీరం పై 3 కత్తి పోట్లు తో దారుణ హత్య కు గురైనట్లు పోలీసులు గుర్తించారు.. స్థానికంగా సెంట్రింగ్, మెటీరియల్ కిరాయికి ఇస్తూ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని సమాచారం..కేసు నమోదుచేసుకొన్న పోలీసులు డాగ్ స్వ్కాడ్ తో స్థలాన్ని పరిశీలించారు.
Tags: Brutal murder of financier